కన్నా వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు: సోము వీర్రాజు

  • బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ
  • సోము వీర్రాజు, జీవీఎల్ పై విమర్శలు
  • తానేంటో హైకమాండ్ కు తెలుసన్న సోము వీర్రాజు
సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో ఏపీ బీజేపీలో ముసలం పుట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో ఏమాత్రం పుంజుకోలేకపోతున్న బీజేపీకి కన్నా రాజీనామా మరింత నష్టాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గం డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని... వాటిపై తాను ఎప్పుడూ స్పందించలేదని, ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఏమిటనేది పార్టీ హైకమాండ్ కు తెలుసని అన్నారు. 

జనసేనతో బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు స్పందిస్తూ... బీజేపీతో పొత్తులో ఉన్నామని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వారాహి వాహనానికి పూజ చేయించిన సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను ఇస్తోందని... ఆ నిధులన్నింటినీ తాము ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం శోచనీయమని విమర్శించారు.

Somu Veerraju
BJP
Kanna Lakshminarayana

More Telugu News