చంద్రబాబును అరెస్ట్ చేయాలి.. ఆయన సభలకు అనుమతిని ఇవ్వకూడదు: జోగి రమేశ్

  • గుంటూరు సభ తొక్కిసలాటలో ముగ్గురి మృతి
  • ఇవి చంద్రబాబు హత్యలే అన్న జోగి రమేశ్
  • బాబును రాష్ట్రంలో తిరగనిస్తే మరింత మంది బలైపోతారని వ్యాఖ్య
గుంటూరులో చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు వెళ్లిపోయారు. ఆ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మరోవైపు, ఈ ఘటనపై మంత్రి జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి చంద్రబాబు చేసిన హత్యలేనని అన్నారు. 

నాలుగు రోజుల క్రితమే 8 మందిని బలి తీసుకున్న చంద్రబాబు... ఇప్పుడు మరో ముగ్గురుని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. కొత్త సంవత్సరం రోజున సంతోషంగా గడపాల్సిన వారికి విషాదాన్ని మిగిల్చారని విమర్శించారు. ఈ మరణాలకు కారణమైన చంద్రబాబును అరెస్ట్ చేయాలని అన్నారు. చంద్రబాబు సభలకు అనుమతిని ఇవ్వొద్దని డీజీపీని కోరుతున్నానని చెప్పారు. చంద్రబాబును రాష్ట్రంలో తిరగనిస్తే ఆయన మరింత మందిని బలి తీసుకుంటారని అన్నారు. బాబు అధికార దాహానికి ప్రజలు బలైపోతున్నారని వ్యాఖ్యానించారు.

Jogi Ramesh
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News