మీరెవరో మాకు తెలియదంటూ సోము వీర్రాజును ఆపేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది

  • విశాఖలో సోము వీర్రాజుకు చేదు అనుభవం
  • కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి వెళ్లిన ఆయనను గేటు వద్దే ఆపిన సిబ్బంది
  • కిషన్ రెడ్డి చెప్పడంతో ఆయనను లోపలకు పంపిన వైనం
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కూడా కార్యక్రమానికి వెళ్లారు. అయితే ఆయనను లోపలకు వెళ్లనీయకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనను లోపలకు పంపించరా? అంటూ సిబ్బందిపై ఆయన మండిపడ్డారు. దీన్ని గమనించిన కిషన్ రెడ్డి ఆయనను లోపలకు అనుమతించమని చెప్పడంలో వీర్రాజును లోపలకు పంపించారు. మరోవైపు వీర్రాజును అధికారులు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. గేట్ వద్ద ఉన్న సిబ్బందికి మీ గురించి తెలియదని సర్ది చెప్పారు.

Somu Veerraju
Kishan Reddy
BJP
Vizag

More Telugu News