దళితులను జగన్ మోసం చేస్తున్నారు: నక్కా ఆనందబాబు

Jagan deceiving Dalits says Nakka Anand Babu
  • దళితుల హక్కులను జగన్ కాలరాస్తున్నారన్న ఆనందబాబు
  • దళితుల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని విమర్శ
  • దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మండిపాటు
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. దళితులను జగన్ మోసగిస్తున్నారని చెప్పారు. దళితుల పథకాలనే కాకుండా వారి హక్కులను కూడా హరిస్తున్నారని అన్నారు. పలు పాఠశాలలను జగన్ రద్దు చేశారని విమర్శించారు. స్కూళ్లను మూసివేయడం, రీయింబర్స్ మెంట్ రద్దుతో దళితులు నష్టపోతున్నారని చెప్పారు. 

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని అన్నారు. దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని... వారికి రక్షణ కరువైందని అన్నారు.
Go Back to Shorts
Nakka Anand Babu
Telugudesam
Jagan
YSRCP
Dalits

More Telugu News