శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక మా హస్తం లేదు: బీజేపీ

It is Shiv Sena personal matter says BJP
  • మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
  • ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితిలో ప్రభుత్వం
  • ఈ పరిస్థితికి బీజేపీనే కారణమని ఆరోపిస్తున్న శివసేన, ఎన్సీపీ
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది. శివసేన కీలక నేత  ఏక్ నాథ్ షిండేతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు మరికొందరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి గువాహటిలో ఓ హోటల్ లో బస చేశారు. 

మరోవైపు శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పందిస్తూ ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. తిరుగుబాటు అనేది శివసేన అంతర్గత వ్యవహారమని... దీని వెనుక బీజేపీ హస్తం లేదని అన్నారు. 

తమ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. నిన్న మధ్యాహ్నం ఫడ్నవిస్ తో కలిసి తాను భోజనం చేశానని... ఆ తర్వాత ఆయన ఢిల్లీకి పయనమయ్యారని తెలిపారు. తాము కలిసినప్పుడు శివసేన సంక్షోభంపై తనతో ఫడ్నవిస్ ఎక్కువగా చర్చించలేదని చెప్పారు. శివసేనలో ఏం జరుగుతోందనే విషయం గురించి తాను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.
Go Back to Shorts
Maharashtra
Shiv Sena
BJP

More Telugu News