మెక్ డొనాల్డ్స్ లో కూల్ డ్రింక్‌ లో బల్లి.. రూ. లక్ష జరిమానా విధించిన అధికారులు

Lizard in cool drink supplied in Mc Donalds
  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
  • రూ. 300 చెల్లించేందుకు ముందుకొచ్చిన ఔట్ లెట్ సూపర్ వైజర్
  • ఔట్ లెట్ కు సీలు వేసిన మున్సిపల్ అధికారులు
మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ లోని కూల్ డ్రింక్ లో చనిపోయిన బల్లి కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో సదరు మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ లో తనిఖీలు జరిపిన అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు రూ. 1 లక్ష జరిమానా విధించారు. ఆ ఔట్ లెట్ కు సీలు వేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే... భార్గవ్ జోషి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మెక్ డొనాల్డ్స్ ఔట్ లెక్ కు వెళ్లారు. కూల్ డ్రింక్స్, బర్గర్ లను ఆర్డర్ చేశారు. శీతల పానీయంలో బల్లి కనిపించడంతో ఔట్ లెట్ సూపర్ వైజర్ కు ఫిర్యాదు చేశారు. అయితే, దీనికి బదులుగా రూ. 300 చెల్లించడానికి సూపర్ వైజర్ ముందుకొచ్చాడు. దీని గురించి తెలుసుకున్న అధికారులు సదరు ఔట్ లెట్ పై చర్యలు తీసుకున్నారు. కార్పొరేషన్ నుంచి అనుమతి లేకుండా ఔట్ లెన్ ను తెరవరాదని ఆదేశించారు.
Go Back to Shorts
Mc Donalds
Lizard
Gujarat

More Telugu News