దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India Corona updates
  • గత 24 గంటల్లో 2,827 కేసుల నమోదు
  • ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న 3,230 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,067
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రోజువారీ కేసులు మరోసారి 3 వేలకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.71 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 2,827 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇదే సమయంలో 3,230 మంది కరోనా నుంచి కోలుకోగా... 24 మంది మృతి చెందారు. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్న సంగతి గమనార్హం. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,13,413కు చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,70,165 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,181కి చేరుకుంది.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News