డ‌బ్ల్యూఆర్ఆర్ పేరిట‌ టీఆర్ఎస్ మ‌రో లూటీ: రేవంత్ రెడ్డి

revanth reddy harsh comments on trs
  • వ‌రంగ‌ల్ రింగు రోడ్డు పేరిట సారవంత‌మైన భూముల‌ను లాక్కునేందుకు ప్రయత్నాలన్న రేవంత్  
  • తమ రియలెస్టేట్ మాఫియాను రంగంలోకి దించారంటూ ఆరోపణలు 
  • ఇప్ప‌టికే పెద్ద ఎత్తున భూముల‌ను లాగేశారన్న రేవంత్ 
వ‌రంగ‌ల్ రింగు రోడ్డు (డ‌బ్ల్యూఆర్ఆర్) పేరిట టీఆర్ఎస్ మ‌రో లూటీకి తెరతీసింద‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ‌రంగ‌ల్ రింగు రోడ్డు పేరిట వ‌రంగ‌ల్ ప‌రిధిలోని సారవంత‌మైన భూములను రైతుల నుంచి లాక్కునేందుకు ఇప్ప‌టికే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు త‌మ రియ‌లెస్టేట్ మాఫియాను రంగంలోకి దించార‌ని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే వంద‌లు, వేల ఎక‌రాల భూముల‌ను రైతుల నుంచి అతి త‌క్కువ ధ‌రకే లాగేసుకున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు.
Go Back to Shorts
TPCC President
Revanth Reddy
WRR
Congress

More Telugu News