ఆర్సీబీ జట్టుతో పోరులో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్

LSG won the toss against RCB
  • ముంబయిలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న లక్నో
  • లక్ష్యఛేదనకే మొగ్గు 
ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈసారి ఐపీఎల్ కోసం ఏర్పాటు చేసిన పిచ్ లు బ్యాటింగ్ కు విపరీతంగా సహకరిస్తుండడంతో ప్రతి జట్టు లక్ష్యఛేదనకే మొగ్గు చూపుతోంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన అనేక జట్లు గెలుపొందడమే అందుకు నిదర్శనం. 

కాగా, నేటి మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, అదే జట్టుతో బరిలో దిగుతున్నామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు. అటు, లక్నో కూడా మార్పుల్లేని జట్టుతోనే బరిలో దిగుతోంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటివరకు చెరో 6 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ, లక్నో జట్లు నాలుగేసి విజయాలు సాధించాయి.
Go Back to Shorts
LSG
Toss
RCB
IPL

More Telugu News