ఉక్రెయిన్ లోని థియేటర్ పై రష్యా దాడి.. వందలాది మంది మృతి!

300 killed in russia attack on Ukraine theatre
  • ఉక్రెయిన్ పై దాడిని ఉద్ధృతం చేసిన రష్యా
  • రష్యా దాడిలో 300 మంది మృతి
  • 16 వేలకు పైగా రష్యా సైనికులను చంపామన్న ఉక్రెయిన్
ఉక్రెయిన్ పై రష్యా బలగాలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి. కీలకమైనటువంటి కీవ్, మరియుపోల్, ఖార్కీవ్ నగరాలపై క్షిపణులు, బాంబులతో దాడి చేస్తోంది. రష్యా దాడుల్లో సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నారు. తాజాగా మరియుపోల్ లో వందల మంది తలదాచుకున్న ఓ థియేటర్ పై రష్యా దాడులు చేసింది. 

ఈ దాడుల్లో 300 మంది మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో యావత్ ప్రపంచం షాక్ కు గురవుతోంది. మరోవైపు ఇప్పటి వరకు 16,100 మందికి పైగా రష్యా సైనికులను హతమార్చినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది. దీంతోపాటు 561 ట్యాంకులు, 115 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లు, 1625 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది.
Go Back to Shorts
Ukraine
Russia

More Telugu News