టీడీపీ ఉనికి నానాటికీ తగ్గిపోతున్నద‌నే ప‌చ్చ‌కుల మీడియా ఇలా చేస్తోంది: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp
  • పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదని చెబుతున్నాం
  • పచ్చ కుల మీడియా మాత్రం గింజుకోవడం ఆపడం లేదు
  • ఆ బాధతోనే తప్పుడు కథనాలను వండి వారుస్తోంది
  • పచ్చకుల మీడియా రాతలను  నమ్మడం జనం ఎప్పుడో మానేశారు
ఏపీలో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదని నిన్న అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్ స్పష్టం చేశారు. ఇటీవల చంద్ర‌బాబు నాయుడి అనుకూల మీడియాలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నట్లు తరచుగా కథనాలను వండివార్చుతున్నారని సీఎం విమర్శించారు. అస‌త్యాల‌కైనా, వక్రీకరణ కైనా హద్దు పద్దూ ఉండాలని ఆయన మండిప‌డ్డారు. ఇదే విష‌యాన్ని గుర్తు చేస్తూ వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి మీడియాపై మండిప‌డ్డారు.  

'పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదని చెబుతున్నా పచ్చ కుల మీడియా మాత్రం గింజుకోవడం ఆపడం లేదు. టీడీపీ ఉనికి నానాటికీ తగ్గిపోతున్నదన్నదే దాని బాధ. ఆ బాధతోనే తప్పుడు కథనాలను వండి వారుస్తోంది. పచ్చకుల మీడియా రాతలను నమ్మడం జనం ఎప్పుడో మానేశారు' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Telugudesam

More Telugu News