ఏపీలో తాజాగా 54 మందికి కొవిడ్... పూర్తి వివరాలు ఇవిగో!

AP Corona Daily Update
  • గత 24 గంటల్లో 11,594 కరోనా పరీక్షలు
  • అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 57 మంది
  • ఇంకా 507 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 11,594 కరోనా పరీక్షలు నిర్వహించగా, 54 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ రాలేదు. మిగిలిన జిల్లాల్లో ఒకటీ అరా కేసులు వెల్లడయ్యాయి. 

అదే సమయంలో 57 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,066 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,829 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 507 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Update
Today Cases

More Telugu News