భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
  • 1,047 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 312 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఐదున్నర శాతం లాభపడిన హెచ్డీఎఫ్సీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,047 పాయింట్లు లాభపడి 57,864కి చేరుకుంది. నిఫ్టీ 312 పాయింట్లు పెరిగి 17,287కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (5.50%), టైటాన్ (4.50%), కోటక్ బ్యాంక్ (3.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.18%), ఏసియన్ పెయింట్స్ (3.07%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.81%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.23%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News