ఏపీలో తాజాగా 59 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

AP Corona Updates
  • గత 24 గంటల్లో 10,914 కరోనా పరీక్షలు
  • అనంతపురం జిల్లాలో 28 కొత్త కేసులు
  • పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 83 మంది
  • ఇంకా 523 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 10,914 కరోనా పరీక్షలు నిర్వహించగా, 59 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 28 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 83 మంది కరోనా నుంచి కోలుకున్నారు కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,943 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,690 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 523 మంది చికిత్స పొందుతున్నారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Bulletin
Daily Update

More Telugu News