ఏపీలో 141 క‌రోనా కేసులు.. ముగ్గురి మృతి

  • గత 24 గంటల్లో 15,213 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరిలో 27, గుంటూరు జిల్లాలో 23 కేసులు
  • క‌డ‌ప జిల్లాలో కొత్త కేసుల్లేవ్‌
  • ఇంకా 3,518 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 15,213 కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 27 కేసులు న‌మోదు కాగా.. గుంటూరు జిల్లాలో 23 కేసులు న‌మోద‌య్యాయి. సీఎం వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు.

అదే సమయంలో 1,329 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,605 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,99,362 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,518 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 14,725కి పెరిగింది.

Corona Virus
Andhra Pradesh
health bulletin

More Telugu News