తండ్రికి ఉన్న అల్జీమర్స్ జబ్బు పుత్రుడికీ వచ్చినట్టుంది: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp
  • విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా అంశాలపై పోరాడుతున్నాం
  • పార్లమెంటులో వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాన్ని దేశమంతా చూస్తోంది
  • కానీ తండ్రీకొడుకులకు కనిపించకపోవడం శోచనీయం
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, యువ‌నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప‌రోక్షంగా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా అంశాలపై వైసీపీ పోరాడుతోంద‌ని, అయితే, ఈ విష‌యం చంద్ర‌బాబు, లోకేశ్‌కు మాత్రం క‌న‌ప‌డ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.

'తండ్రికి ఉన్న అల్జీమర్స్ జబ్బు పుత్రుడికీ వచ్చినట్టుంది. విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా అంశాలపై పార్లమెంటులో వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాన్ని దేశమంతా చూస్తోంది. కానీ తండ్రీకొడుకులకు కనిపించకపోవడం శోచనీయం' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News