య‌థేచ్ఛగా సాగుతున్న గడ్డంగ్యాంగ్ గ్యాంబ్లింగ్: వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ‌

devineni slams ycp
  • గోవాను తలదన్నే రీతిలో క్యాసినో
  • నయా దందాతో కోట్ల రూపాయ‌ల దోపిడీ
  • మీ బూతుల మంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో గ్యాంబ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందని తెలుపుతూ ఆయ‌న ఓ వీడియో పోస్ట్ చేశారు.

'గుడివాడలో యథేచ్ఛగా సాగుతున్న గడ్డం గ్యాంగ్ గ్యాంబ్లింగ్. గోవాను తలదన్నే రీతిలో "క్యాసినో" ఏర్పాటు చేసిన మండపం ఎవరిది? ధాన్యానికి మద్దతు ధర లేక, అమ్మిన వాటికి డబ్బులు రాక రైతులు సంక్రాంతికి దూరమైతే.. నయా దందాతో కోట్ల రూపాయ‌లు కొల్లగొడుతున్న మీ బూతుల మంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?' అని దేవినేని ఉమ ప్ర‌శ్నించారు. ఏపీలో గ్యాంబ్లింగ్‌పై ప‌లు వార్తా చానెళ్ల‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న వీడియోలో చూపించారు.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News