'మా బాబే సీఎం' అని సినిమా తీసుకుని మురిసిపోండి.. వేరే మార్గం లేదు: విజ‌య‌సాయిరెడ్డి సెటైర్

vijay sai slams tdp
  • ‘పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయింది
  • ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందంట
  • వరల్డ్ మ్యాప్ లోంచి ఏపీ అదృశ్యమైందంట
  • అధికారం పోగొట్టుకుని పొర్లిపొర్లి ఏడుస్తున్నారు
ప్ర‌పంచ ప‌టం లోంచి ఏపీ అదృశ్యమైందంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలోని మ‌నుషులు వారికి క‌న‌ప‌డ‌డం లేదా? అని ఆయ‌న నిల‌దీశారు.

'‘పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందంట. వరల్డ్ మ్యాప్ లోంచి ఏపీ అదృశ్యమైందంట! 5 కోట్ల మంది వీళ్లకు మనుషుల్లా కనిపించడం లేదా? అధికారం పోగొట్టుకుని పొర్లిపొర్లి ఏడుస్తున్నారు. 'మా బాబే సీఎం' అని గ్రాండ్ గా ఒక సినిమా తీసుకుని మురిసిపోండి. వేరే మార్గం లేదు' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News