ఏపీలో గత 24 గంటల్లో 839 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 37,553 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 175 కొత్త కేసులు
  • విశాఖ జిల్లాలో 174 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,659 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37,553 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 839 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 175, విశాఖ జిల్లాలో 174 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ భారీగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 150 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,80,602 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,62,440 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,659 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా వస్తున్నప్పటికీ మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఊరటనిచ్చే విషయం. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,503కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
New Cases
Today Cases

More Telugu News