ఏపీలో మరో 840 కరోనా కేసుల నమోదు

  • ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
  • గత 24 గంటల్లో 37,849 కరోనా టెస్టులు
  • విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు
  • చిత్తూరు జిల్లాలో 150 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి.. 2,972 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకుంది. గత కొన్నిరోజులుగా 500కి పైబడి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 37,849 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 840 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 150 కేసులను గుర్తించారు. అదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,79,763 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,62,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,972 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,501కి పెరిగింది.

Corona Virus
Positive Cases
Today Cases
Andhra Pradesh

More Telugu News