బుర్జ్ ఖలీఫాపై మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కుటుంబాల సందడి.. ఫొటోలు ఇవిగో!

  • గత కొన్ని రోజులుగా దుబాయ్ లో ఉంటున్న మహేశ్
  • మహేశ్ కుటుంబంతో కలిసిన వంశీ పైడిపల్లి కుటుంబం
  • కలిసి న్యూఇయర్ వేడుకలను జరుపుకోనున్న వైనం
సూపర్ స్టార్ మహేశ్ బాబు గత కొన్ని రోజులుగా దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడే తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తన కుటుంబంతో కలిసి మహేశ్ ఫ్యామిలీతో జాయిన్ అయ్యారు. వీరంతా కలిసి దుబాయ్ లో సందడి చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను కలిసి జరుపుకోనున్నారు. తాజాగా వీరంతా కలిసి ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu
Vamsi Paidipalli
Tollywood
Dubai
Burj Khaleefa

More Telugu News