మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ

Huge rally in support for three capitals in Tirupati
  • రేపు తిరుపతిలో రైతుల సభ
  • నేడు ఆసక్తికర పరిణామం
  • రాయలసీమ మేధావుల ఫోరం భారీ ర్యాలీ
  • వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
  • వికేంద్రీకరణతోనే అభివృద్ధి అంటూ నినాదాలు
ఏపీకి ఒకటే రాజధాని అంటూ ఓవైపు అమరావతి రైతులు రేపు తిరుపతిలో సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా నేడు తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం చేపట్టిన ఈ ర్యాలీకి వేలాదిమంది తరలివచ్చారు. బాలాజీ కాలనీ నుంచి తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యువతీయువకులు అత్యధికంగా పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమంటూ నినాదాలు చేశారు.
Go Back to Shorts
Rally
Tirupati
Three Capitals
Andhra Pradesh

More Telugu News