తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు: విజ‌య‌సాయిరెడ్డి

vijaya sai slams chandra babu
  • చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు
  • ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా ఆయన వ‌క్ర‌బుద్ధి మారలేదు
  • వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడారు
  • 'మనిషివా చంద్రబాబు' అనే పరిస్థితి తెచ్చుకున్నాడు
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన‌ చంద్రబాబు నాయుడు ప్ర‌ద‌ర్శించిన తీరు బాగోలేద‌ని ఆయ‌న అన్నారు.  

''గాల్లో కలిసిపోతారని సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి 'మనిషివా చంద్రబాబు' అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు'' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News