యమునా ఎక్స్‌ప్రెస్ వేకి వాజ్‌పేయి పేరు.. కేంద్రం నిర్ణయం!

Yamuna Expressway likely to be renamed after former PM  Vajpayee
  • ఈ నెల 25న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన
  • హాజరుకానున్న మోదీ, యోగి, బీజేపీ ముఖ్యనేతలు
  • అదే రోజు పేరు మార్పుపై అధికార ప్రకటన
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్చుకుంటూ పోతోంది. తాజాగా ఆ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగానే యుమునా ఎక్స్‌ప్రెస్ వే పేరును మారుస్తూ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

విమానాశ్రయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్ వే పేరును మారుస్తూ అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

Go Back to Shorts
Yamuna Express Way
Atal Bihari Vajpayee
Uttar Pradesh

More Telugu News