క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన నీతి ఆయోగ్ బృందం

  • ఏపీకి విచ్చేసిన నీతి ఆయోగ్ బృందం
  • సీఎంతో మర్యాదపూర్వక భేటీ
  • ఎస్డీజీ ఇండెక్స్ నివేదిక అందజేత
  • ఏపీ అభివృద్ధి వివరాలు తెలిపిన సీఎం జగన్
నీతి ఆయోగ్ బృందం ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఆ బృందంలోని సభ్యులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్డీజీ ఇండెక్స్ 2020-21 నివేదికను వారు ఏపీ సీఎంకు అందజేశారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ స్పందిస్తూ, ఏపీ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను నీతి ఆయోగ్ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు సంయుక్త సమద్దార్, నీతి ఆయోగ్ ఎస్డీజీ అధికారి అలెన్ జాన్, నీతి ఆయోగ్ డేటా అనలిస్ట్ సౌరవ్ దాస్ పాల్గొన్నారు.

Niti Aayog
CM Jagan
Tadepally
Camp Office
Andhra Pradesh

More Telugu News