టోక్యో ఒలింపిక్స్.. నిరాశపరిచిన అతాను దాస్

  • నేడు ఓటమితో ప్రారంభించిన భారత అథ్లెట్లు
  • పతకంపై ఆశలు రేపి నిరాశ పరిచిన అతాను దాస్
  • బాక్సింగ్‌లో ఓడిన అమిత్ పంఘాల్
టోక్యో ఒలింపిక్స్‌లో నిన్న విజయంతో ప్రారంభించిన భారత ఆటగాళ్లు నేడు పరాజయంతో ప్రారంభించారు. పతకంపై ఆశలు రేపిన భారత ఆర్చర్ అతాను దాస్ నిరాశపరిచాడు. ప్రీక్వార్టర్స్‌లో భాగంగా నేడు జపాన్ ఆర్చర్ పురుకవాతో జరిగిన మ్యాచ్‌లో 6-4 తేడాతో ఓటమి పాలయ్యాడు. బాక్సింగ్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. 52 కిలోల విభాగంలో భాగంగా మార్టెనెజ్‌తో జరిగిన పోరులో అమిత్ పంఘాల్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగి నిరాశ పరిచాడు. కాగా, నిన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనాతోపాటు భారత హాకీ పురుషుల, మహిళా జట్లు విజయం సాధించాయి.

Tokyo Olympics
Amit Panghal
Atanu Das

More Telugu News