వారణాసిలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates Rudraksh Convention Centre in Varanasi
  • జపాన్ సాయంతో రుద్రాక్ష్ సెంటర్ నిర్మాణం
  • సదస్సులు, సమావేశాలకు ఉపయోగపడే భారీ భవనం
  • ఇది ఆకర్షణీయ గమ్యస్థానం అని పేర్కొన్న మోదీ
  • వారణాసిలో నేడు ప్రధాని పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ తన వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో నేడు పర్యటించారు. ఈ సందర్భంగా భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, వారణాసిలో రుద్రాక్ష్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు.

జపాన్ సాయంతో, ఉన్నత కళానైపుణ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు వెల్లడించారు. వారణాసిలోని ఈ రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుందని తెలిపారు. భారత్, జపాన్ స్నేహ బంధానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ఓ నిదర్శనం అని పేర్కొన్నారు.

2015లో భారత్ లో పర్యటించిన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఉదారంగా ఆర్థికసాయం ప్రకటించారు. ఇది భారతదేశ ఆధ్మాత్మిక నగరం వారణాసికి తాము ఇస్తున్న కానుక అని నాడు ప్రకటించారు.
Go Back to Shorts
PM Modi
Rudraksh Convention Centre
Varanasi
Inauguration
India
Japan

More Telugu News