విశాఖ ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల ఫొటోలు విడుదల చేసిన పోలీసులు

Police releases pictures of deceased maoists
  • కాల్పులతో దద్దరిల్లిన విశాఖ ఏజెన్సీ 
  • తీగలమెట్ట వద్ద భారీ ఎన్ కౌంటర్
  • ఆరుగురు మావోల మృతి
  • ఓ మహిళను గుర్తించాల్సి ఉందన్న ఎస్పీ
  • గాయపడ్డ మావోలు లొంగిపోతే చికిత్సకు హామీ
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మరణించడం తెలిసిందే. తాజాగా, ఎదురు కాల్పుల్లో చనిపోయిన ఆరుగురు మావోయిస్టుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. మృతులను డాక్టర్ అశోక్, రణదేవ్, సంతు, లలిత, పాయికే అని గుర్తించారు.

మరణించిన ఆరుగురిలో మరో మహిళ ఉందని, ఆమెను గుర్తించాల్సి ఉందని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మృతుల బంధువులు పోలీసులను సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పుల ఘటనలో గాయపడినవారు లొంగిపోతే చికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Go Back to Shorts
Maoists
Death
Police
Pictures
Visakhapatnam District

More Telugu News