దేశంలో కొత్త‌గా 62,224 క‌రోనా కేసుల న‌మోదు

Media Bulletin on status of positive cases COVID19 in india
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,70,881
  • మృతుల సంఖ్య మొత్తం  3,79,573
  • 26,19,72,014 మందికి వ్యాక్సిన్లు
  • 38,33,06,971 కరోనా పరీక్షలు
దేశంలో కొత్త‌ క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న 62,224 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,07,628 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,33,105కు చేరింది. మరో 2,542 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,79,573కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,83,88,100 మంది కోలుకున్నారు. 8,65,432 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 26,19,72,014 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,33,06,971 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,30,987 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News