సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెబుతున్న పూజ 
  • పవన్ కల్యాణ్ తో ప్రముఖ నిర్మాత ప్రాజక్ట్ 
  • ఇటలీలో షూటింగ్ చేస్తున్న నాగ చైతన్య  
*  కథానాయిక పూజ హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిన్నది తాజాగా 13 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెప్పింది.
*  ప్రస్తుతం సాయితేజ్ హీరోగా 'రిపబ్లిక్' చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత జె.పుల్లారావు త్వరలో పవన్ కల్యాణ్ తో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయం గురించి ఆయన చెబుతూ, పవన్ కోసం అద్భుతమైన స్క్రిప్టును తయారుచేశామనీ, తమ జేబీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని తెలిపారు.
*  నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'థ్యాంక్యూ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. కొవిడ్ పరిస్థితులలో సైతం కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ అక్కడకు వెళ్లింది.

Pooja Hegde
Pawan Kalyan
Saitej
Naga Chaitanya

More Telugu News