మార్చిలో రూ.1.23 లక్షల కోట్లతో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

Record GST collections in March
  • మునుపెన్నడూ లేనంతగా జీఎస్టీ వసూళ్లు
  • జనవరిలో రూ.1.19 లక్షల కోట్ల మేర జీఎస్టీ
  • ఆ రికార్డు బ్రేక్ చేసిన మార్చి నెల వసూళ్లు
  • ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆర్థికశాఖ
దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక స్థాయిలో వసూళ్లు వచ్చాయి. మార్చి నెలలో రికార్డు స్థాయిలో రూ.1.23 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత భారీస్థాయిలో మునుపెన్నడూ వసూలు కాలేదని తెలిపింది. గతేడాది డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.15 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది జనవరిలో రూ1.19 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి. తాజాగా మార్చిలోనూ జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం విశేషం.

మార్చి నెల వసూళ్లలో సీజీఎస్టీ రూ.22.973 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.29,329 కోట్లు, ఐజీఎస్టీ రూ.62,842 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.31,097 కోట్లతో కలిపి), సెస్ రూ.8,757 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.935 కోట్లతో కలిపి) అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది.
Go Back to Shorts
GST
March
Collections
India

More Telugu News