రోజాను పరామర్శించిన వైసీపీ నేతలు

YSRCP leaders meets Roja
  • రోజాకు రెండు ఆపరేషన్లను నిర్వహించిన వైద్యులు
  • చెన్నై ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న రోజా
  • పరామర్శించిన సుబ్బారెడ్డి, చెవిరెడ్డి
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు వైద్యులు రెండు ఆపరేషన్లను నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు రోజాను పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. వీరిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రోజాతో కాసేపు ముచ్చటించారు. అనంతరం రోజా ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రోజా త్వరగా కోలుకోవాలని పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఆమె కోసం అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Go Back to Shorts
Roja
YSRCP

More Telugu News