కొత్త డైరెక్టర్ తో నందమూరి కల్యాణ్ రామ్ నూతన చిత్రం ప్రారంభం

Nandamuri Kalyanram new movie launched
  • రాజేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్
  • రాజేంద్రకు ఇదే తొలి చిత్రం
  • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా
  • మార్చి 2వ వారం నుంచి షూటింగ్
టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు. కొత్త డైరెక్టర్ రాజేంద్ర దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది కల్యాణ్ రామ్ కు 19వ చిత్రం. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాజేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్క్రిప్టుపై నమ్మకంతోనే కల్యాణ్ రామ్ ఈ చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 2వ వారంలో ప్రారంభం కానుంది. ఇతర తారాగణం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.
Go Back to Shorts
Nandamuri Kalyanram
New Movie
Rajendra
Mythri Movie Makers
Tollywood

More Telugu News