ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు

Seventy new cases identify in AP
  • గడచిన 24 గంటల్లో 26,844 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కేసులు
  • కర్నూలు, పశ్చిమ గోదావరి, నెల్లూరులో కొత్త కేసులు నిల్
  • యాక్టివ్ కేసుల సంఖ్య 917
రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 26,844 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున గుర్తించారు.

అదే సమయంలో 115 మంది కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,88,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,478 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 917 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 7,160గా నమోదైంది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Active Cases

More Telugu News