ప‌ట్టాభి ఇంటికి చేరుకున్న చంద్ర‌బాబు.. దాడి గురించి వివరించిన పట్టాభి!

chandrababu goes pattabhi home
  • విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు
  • ప‌ట్టాభికి త‌గిలిన గాయాల‌ ప‌రిశీలన‌
  • టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరిక  
తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై కొంద‌రు దాడికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌లో ఉన్న‌ ప‌ట్టాభి ఇంటికి చేరుకున్నారు. ప‌ట్టాభిని ప‌రామ‌ర్శించి, ఆయ‌నకు త‌గిలిన గాయాల‌ను ప‌రిశీలించారు.

త‌న‌పై జ‌రిగిన దాడి గురించి చంద్ర‌బాబుకు ప‌ట్టాభి వివ‌రించి చెప్పారు. ఆ స‌మ‌యంలో ప‌ట్టాభి మంచంపైనే ప‌డుకుని ఉన్నారు. ప‌ట్టాభి ఇంటికి  దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, బోండా ఉమా మ‌హేశ్వర‌రావుతో పాటు ప‌లువురు టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా భారీగా చేరుకుంటున్నారు.
Go Back to Shorts
pattabhi
Chandrababu
Telugudesam
Vijayawada

More Telugu News