దేశంలో కొత్త‌గా 19,078 మందికి కరోనా నిర్ధారణ

India reports 19078 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788
  • మృతుల సంఖ్య 1,49,218
  • కోలుకున్న వారు 99,06,387 మంది
  • మొత్తం 17,39,41,658 కరోనా పరీక్షలు  
దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 19,078 మందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే 22,926 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 224 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,218కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,06,387 మంది కోలుకున్నారు. 2,50,183 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,39,41,658 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,29,964 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News