రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్లున్నారు: విజయశాంతి ఎద్దేవా

vijaya shanti slams trs
  • సీఎం కేసీఆర్ గారు వరాలజల్లు కురిపిస్తున్నారు
  • ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ, ప్రమోషన్లు, ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గారు
  • ఈ ప్రకటనల మర్మమేంటో తెలియదనుకుంటే పొరపాటు
  • దీని వెనుక కుట్ర.. ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవు  
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తోన్న ప్రకటనలను ఆమె ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు.

‘సీఎం కేసీఆర్ గారు కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గడం ఇలా గత నాలుగైదు రోజులుగా కేసీఆర్ గారు చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటు. గడచిన టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనా కాలంలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు ఒకొక్కటిగా దృష్టి సారిస్తున్నారు

‘దీని వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవు. అయితే, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిణామాలే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉపఎన్నికల్లోనూ వస్తే... ఈ సీఎం గారు ఎంతో కొంత జన సంక్షేమం గురించి కనీసం ఆలోచించి, తద్వారా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ, సమయం, అపాయింట్‌‌మెంట్లు ఇచ్చి ప్రజా సమస్యలపై కొంత దృష్టి పెట్టే ప్రయత్నం జరగవచ్చు’ అని విజయశాంతి చెప్పారు.
 
‘అందుకోసమైనా తదుపరి ఎన్నికల ముందువరకూ కొంతకాలం అధికారంలో ఉండే ఈ టీఆరెస్ ప్రభుత్వానికి, ప్రతి సందర్భంలోను ఓటమి రుచి చూపించవలసిన బాధ్యత ఉందని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోంది’ అని విజయశాంతి అన్నారు.
 
‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు.. ఎందుకు పనికి రాని రాష్ట్రం గా మార్చాడు. ఒక పక్క ఆకలి కేకలు మరో పక్క నిరుద్యోగుల సమస్యలు కనీసం విశ్వవిద్యాలయంలో వీసీని కూడా నియమించలేక పోయాడు ఇక రాష్ట్ర ఉద్యోగుల సంగతి అయితే మరీ దారుణం. దొర తెలంగాణ కాదు మాకు నవ తెలంగాణ కావాలి’ అని విజయశాంతి తెలిపారు.
Go Back to Shorts
vijayashanthi
BJP
TRS

More Telugu News