దేశంలో కొత్తగా 21,821 మందికి కరోనా

India reports 21821 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,66,674
  • మృతుల సంఖ్య 1,48,738
  • మొత్తం 17,20,49,274 కరోనా పరీక్షలు
భారత్‌లో గత 24 గంటల్లో 21,821 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 26,139 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,66,674కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 299 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,48,738కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 98,60,280 మంది కోలుకున్నారు. 2,57,656 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,20,49,274 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,27,244 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News