ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. నలుగురి మృతి

  • 24 గంటల్లో కొత్తగా 630 కేసుల నమోదు
  • 8,71,305కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 6,166
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 97, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 5 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,71,305కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 7,024 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 882 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News