టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇండియా... గెలిచి పరువు కాపాడుకునేనా?

India Won the Toss in Third Oneday
  • తొలి రెండు మ్యాచ్ లలో ఓటమి
  • ఇందులో గెలిస్తే పెరగనున్న ఆత్మస్థైర్యం
  • త్వరలోనే టీ-20 సిరీస్
మరికాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కాన్ బెర్రాలో మూడవ వన్డే ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లనూ దారుణంగా కోల్పోయిన భారత జట్టు, ఈ మ్యాచ్ లో గెలిచి, పరువును నిలుపుకోవడంతో పాటు, రానున్న టీ-20 సిరీస్ కు ఆత్మస్థైర్యాన్ని పెంచుకుని వెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, తొలుత బ్యాటింగ్ ను ఎంచుకున్నారు.

జట్ల వివరాలు:
భారత్: శిఖర్ ధావన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, టి.నటరాజన్.

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, మార్నస్ లుబుస్ చేంజ్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, మోసెస్ హెన్రిక్స్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్ వెల్, ఆస్టన్ అగర్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజెల్ వుడ్.
Go Back to Shorts
India
Australia
Cricket
Oneday

More Telugu News