కూల్చడంలో సీఎం జగన్ అద్భుతమైన ప్రతిభ చూపారు: విష్ణుకుమార్ రాజు వ్యంగ్యం

  • ఇది కూల్చివేతలు, రద్దుల ప్రభుత్వమంటూ వ్యాఖ్యలు
  • సీఎం జగన్ ప్రజావేదికను కూల్చారంటూ విమర్శలు
  • ప్రధానిని జగన్ కలవడంలో తప్పులేదన్న విష్ణుకుమార్ రాజు
బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఇది కూల్చివేతలు, రద్దుల ప్రభుత్వం అని విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రజావేదికను కూల్చివేశారని అన్నారు. కూల్చడంలో సీఎం జగన్ అద్భుతమైన ప్రతిభ చూపారని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ పాలనతో రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి కలుగుతోందని, వైసీపీ సర్కారు దుందుడుకు నిర్ణయాల వల్ల ప్రజలు కష్టాల పాలవుతున్నారని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీచేస్తుందని, అధికారం తమదేనని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీపై ఆయన స్పందించారు. ప్రధానిని సీఎం జగన్ ను కలవడంలో తప్పేమీ లేదని, ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరుతుందని తాను భావించడంలేదని అభిప్రాయపడ్డారు.

Vishnu Kumar Raju
Jagan
YSRCP
Andhra Pradesh
BJP

More Telugu News