చైనాతో ఉద్రిక్తతలు... ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

Markets ends in flat note
  • 14 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 15 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2 శాతానికి పైగా పుంజుకున్న ఎస్బీఐ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 38,855కి చేరుకుంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,464 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఇండియా (2.30), టీసీఎస్ (1.81), టెక్ మహీంద్రా (1.76), హిందుస్థాన్ యూనిలీవర్ (1.16), బజాజ్ ఫైనాన్స్ (1.03).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.71), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.52), ఏసియన్ పెయింట్స్ (1.34), భారతి ఎయిర్ టెల్ (1.19), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.11).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News