బిగ్ బాస్ లో కట్టప్ప ఎవరో చెప్పకనే చెప్పేసిన గంగవ్వ!

  • తొలివారంలోనే ఆసక్తిని పెంచిన హౌస్ మేట్స్
  • అఖిల్ మొహంపైనే నీపేరు రాశానని చెప్పిన గంగవ్వ
  • అర్ధరాత్రి సీక్రెట్ రూమ్ దాటిన అరియానా, సోహైల్
టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్, తొలివారంలోనే ఆసక్తిని పెంచింది. కంటెస్టెంట్ల ఏడుపులు, అర్థం లేని గొవడలతో పాటు 'కట్టప్ప ఎవరు?' అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గంగవ్వ గురించే. ఆమె తన మాటలతో ఇంట్లో నవ్వులు పూయిస్తోంది. తొలి వారంలో ఆమె నామినేట్ అయినా, తనకు వీక్షకుల్లో ఉన్న పాప్యులారిటీతో ఆమె కచ్చితంగా గట్టెక్కుతుందనే అంచనా.

హౌస్ లో కట్టప్ప ఎవరని భావిస్తున్నారంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అత్యధికులు గంగవ్వ వైపే నిలిచారు. ఆమె అఖిల్ పేరును రాయగా, కరాటే కల్యాణి, అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్, సుజాతలు కూడా అఖిల్ పేరునే రాశారు. మిగతా వారు లాస్య, మెహబూబ్ పేర్లను రాసినా, గంగవ్వ మాత్రం తనదైన అమాయకత్వంతో అఖిల్ వద్దకు వెళ్లి, అందరమూ నీ పేరే రాశామంటూ ముఖంపైనే చెప్పేసింది.

ఇక మరో ఆసక్తికర ఘటన, సీక్రెట్ రూములో ఉన్న అరియానా, సోహైల్, హౌస్ మేట్స్ తిండి పెట్టకపోయేసరికి ఆకలితో అల్లాడిపోయి, ఆపై బిగ్ బాస్ ఆదేశంతో అర్ధరాత్రి 12 గంటలకు ఆ రూమ్ దాటి బయటకు వచ్చేసి, తమకు జరిగిన అన్యాయంపై ఇతర కంటెస్టెంట్లను కడిగేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సోహైల్, అభిజిత్ మధ్య పెద్ద గొడవే జరిగిందని సమాచారం. ఇక ఈ వివరాలన్నీ తెలియాలంటే, నేటి సాయంత్రం వరకూ ఆగాల్సిందే.

Bigg Boss
Gangavva
Kattappa
Akhil

More Telugu News