నాకు కరోనా సోకింది.. కొవిడ్‌ను జయించి, తిరిగి వస్తా!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • ట్విట్టర్‌లో తెలిపిన బుద్ధా వెంకన్న
  • 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉంటా
  • కొన్ని రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే నేతలకు కూడా కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్న కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలడంతో ఆయన వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. కొన్ని రోజుల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు.

'నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో  పాల్గొంటాను' అని బుద్ధా వెంకన్న చెప్పారు.

Budda Venkanna
Telugudesam
Andhra Pradesh
Corona Virus

More Telugu News