విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి

  • ఆర్మీ ఆసుపత్రి ప్రకటన
  • వెంటిలేటర్‌పైనే చికిత్స  
  • ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పుల్లేవు
అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆసుపత్రి ప్రకటించింది. కరోనా సోకడంతో పాటు ఆయన మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు సర్జరీ చేసి, న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.
 
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోందని ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది. ఆయన రక్తంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, గుండె పనితీరు వంటివి మాత్రం స్థిరంగానే ఉన్నట్లు తెలిపింది.

Pranab Mukherjee
Corona Virus
India

More Telugu News