ఎమ్మెల్యేలు పోయినా ఫర్వాలేదు.. లక్ష కోట్లే కావాలంటున్న చంద్రబాబు: విజయసాయి రెడ్డి సెటైర్

  • బినామీలతో భూములు కొనిపించిన చంద్రబాబు
  • 20 మంది ఎమ్మెల్యేలు పోయినా ఫర్వాలేదన్నట్టున్నారు
  • బాబు దృష్టిలో అమరావతే విలువైనదన్న విజయసాయి
మాజీ సీఎం చంద్రబాబునాయుడి దృష్టిలో అమరావతి ఎంతో 'విలువైనది' అంటూ, అక్కడ బినామీల పేరిట కొన్న భూములు లక్ష కోట్ల విలువైనవని, ఆ లక్ష కోట్లే కావాలని ఆయన అంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "20 మంది ఎమ్మెల్యేలా..? లేక.. బినామీల పేరిట కొన్న భూములకు లక్ష కోట్లా.. అన్న ప్రశ్నకు, ఎమ్మెల్యేలు పోతే పోయారుగానీ.. లక్ష కోట్లే కావాలని బాబు అంటున్నాడు. బాబు దృష్టిలో అమరావతి ఎంతో "విలువైనది" అని అన్నారు.

Vijayasai Reddy
Twitter
Chandrababu
Amaravati

More Telugu News