నెలకు రూ.500 కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పండి జగన్ గారు: దేవినేని ఉమ

devineni fires on ycp
  • కేసులు1,02,349, మరణాలు1100కు చేరాయి
  • ప్రంట్ లైన్ వారియర్స్ పీపీఈ కిట్లు లేక రైన్ కోట్లతో పని
  • జీతాలురాక ఇబ్బందులు పడుతున్నారు
  • ప్రభుత్వం మాత్రం నెలకు రూ.500 కోట్లు ఖర్చుచేస్తున్నామంటోంది
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని అదుపుచేయలేకపోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలను తెలుపుతూ పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు. కరోనా నియంత్రణకు నెలకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామంటోన్న ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  

'కేసులు1,02,349, మరణాలు1100కు చేరాయి. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రంట్ లైన్ వారియర్స్ పీపీఈ కిట్లులేక రైన్ కోట్లతో పనిచేస్తున్నారు. జీతాలురాక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు పెడుతున్న 500 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు పెట్టినఖర్చు ఎక్కడెక్కడ పెడుతున్నారో పారదర్శకంగా ప్రజలముందుపెట్టండి? వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News