దేశంలో 3,32,424కు చేరిన కరోనా కేసులు

325 deaths and 11502 new COVID19 cases reported in the last 24 hours
  • గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా 
  • అదే సమయంలో 325 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 9,520
  • 1,53,106 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
దేశంలో కొవిడ్‌-19‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 325 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,32,424 చేరగా, మృతుల సంఖ్య మొత్తం  9,520కి పెరిగింది. 1,53,106 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకున్నారు.

Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News