55 కోట్లకు అమ్ముడుపోయిన బయోపిక్ ఓటీటీ హక్కులు!

Thalaivi OTT rights sold for Fifty five crore
  • జయలలిత బయోపిక్ గా 'తలైవి'
  • ప్రధానపాత్రలో కంగన రనౌత్
  • నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లకు హక్కులు      
  • థియేటర్లలో కూడా విడుదలయ్యే అవకాశం  
ఇప్పుడు తమిళనాట ప్రేక్షకులలో చాలా ఆసక్తిని రేపుతున్న చిత్రాలలో 'తలైవి' ఒకటి. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా దీనిని రూపొందిస్తున్నారు. జయలలిత జీవితం మామూలు జీవితం కాదు.. గ్లామరస్ స్టార్ గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి ఆమె. అనంతరం రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసిన నాయకురాలు. ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు కనిపిస్తాయి .. ఎన్నో వివాదాలు కనిపిస్తాయి.. చివరికి ఆమె మరణించిన తీరు కూడా వివాదంగానే మిగిలింది.

అటువంటి మహిళ కథను ఏ విధంగా తెరకెక్కించారన్నది ఏంతో కుతూహలం కలిగించే అంశం. అందులోనూ బాలీవుడ్ సంచలన నటి కంగన రనౌత్ ఇందులో నటించడం మరో విశేషం. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం కంగన ఏంతో కష్టపడింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రసారం హక్కులు 55 కోట్లకు అమ్ముడుపోవడం సంచలనం అయింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కలసి ఈ హక్కులను తీసుకున్నాయని స్వయంగా కంగన మీడియాకు తెలిపింది. అయితే, ఈ చిత్రం కేవలం ఓటీటీ ప్లాట్ ఫాంపైనే కాకుండా థియేటర్లలో కూడా విడుదలవుతుందని ఆమె చెప్పింది. ఇలాంటి సినిమాని థియేటర్లలో చూస్తేనే మజా ఉంటుందని ఆమె భావన!  
Go Back to Shorts
Kangana
Jayalalitha
Thalaivi
A.L Vijay

More Telugu News