వినియోగదారులకు కొత్త ఆఫర్ ప్రకటించిన జియో 

  • రూ. 249 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకుంటే డిస్కౌంట్ కూపన్లు
  • మైజియో యాప్ లో జమకానున్న కూపన్లు
  • నెల పాటు అందుబాటులో ఉండనున్న ఆఫర్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త ఆఫర్ ను ప్రకటించింది. రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి ఒకే విలువ గల నాలుగు డిస్కౌంట్ కూపన్లను ఇస్తున్నట్టు తెలిపింది. రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ ఫుట్ వేర్, ఎజియోలలో ఈ కూపన్ల ద్వారా డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది.

రీచార్జి చేసుకున్న తర్వాత ఈ కూపన్లు మైజియో యాప్ లో జమ అవుతాయని... షాపింగ్ చేసేటప్పుడు కూపన్లను రిడీమ్ చేసుకోవచ్చని వెల్లడించింది. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Jio
New Offer
Coupons

More Telugu News